Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా ప్రొఫెసర్‌ను తాకిన కేసు... శంషాబాద్ పోలీస్ స్టేష‌న్లో లొంగిపోయిన కార్పొరేట‌ర్ చంటిబాబు

హైద‌రాబాద్: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు శుక్రవారం ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో తెలంగాణా పోలీసులు రెండు రోజుల క్రితం వి

Advertiesment
TDP Corporater
, శుక్రవారం, 20 మే 2016 (13:04 IST)
హైద‌రాబాద్: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు శుక్రవారం ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో తెలంగాణా పోలీసులు రెండు రోజుల క్రితం విజ‌య‌వాడ‌కు వ‌చ్చి చంటిబాబు అరెస్టుకు ప్ర‌య‌త్నించారు. నోటీస్ కూడా అందించారు. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని చంటిబాబు విజ్ఞప్తి చేశాడు. 
 
పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని శంషాబాద్ పోలీసులు చంటిబాబుకు వివ‌రించారు. ఇక అరెస్టు తప్పదని భావించిన కార్పొరేటర్ చివరికి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఓ యూనివర్సిటీలో పనిచేసే మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె పక్క సీట్లో కూర్చున్న ఉమ్మడి వెంకటేశ్వరరావు కాలితో పదేపదే తాకి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కేసు నమోదైన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత అంటే 2873 మంది ఓటర్లకు ఇష్టంలేదట... నోటాకు 5.58 లక్షల ఓట్లు!