Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంతలో పయ్యావుల కేశవ్ అనుచరులు ఎంత పని చేశారో తెలుసా?

అనంతపురం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఆగడాలు, అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తమకు ఎదురొస్తే పార్టీలోని చిన్న నేతలపై, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులపై సైతం దాడులకు వెనుకాడటం లేదు.

అనంతలో పయ్యావుల కేశవ్ అనుచరులు ఎంత పని చేశారో తెలుసా?
, గురువారం, 2 ఫిబ్రవరి 2017 (12:48 IST)
అనంతపురం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఆగడాలు, అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తమకు ఎదురొస్తే పార్టీలోని చిన్న నేతలపై, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులపై సైతం దాడులకు వెనుకాడటం లేదు. 
 
తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ  ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు వీరంగం సృష్టించారు. సమస్యలపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. కూడేరు మండలం జల్లిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర మహిళపై దాడిచేస్తూ కాళ్లతో తన్నుతూ.. జట్టుపట్టుకుని ఈడ్చిపడేశాడు. వీరంతా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అనుచరులుగా భావిస్తున్నారు. సమస్యపై ప్రశ్నించినందుకే సుధ అనే మహిళను అందరూ చూస్తుండగానే దాడి చేసిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపివేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమను తిరస్కరించిందనీ.. అందరూ చూస్తుండగానే వైద్య విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు!