Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
, గురువారం, 27 మే 2021 (10:56 IST)
సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గురువారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. 
 
ఈ ఘటన మునగాల మండలంలోని మాధవరం శివారులో చోటు చేసుకుంది. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
మృతులు కోదాడ సాలర్జంగ్‌పేటకు చెందిన గాధరి ఫ్రాన్సిస్ (56), ఎల్లమ్మ (53)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సాలర్జంగ్‌పేటలో విషాదం నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైద్యసేవల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం