Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజా క్షమాపణ లేఖ ఇచ్చారా? ఏదీ ఇక్కడ ఇవ్వగలుగుతారా? సుప్రీంకోర్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపధ్యంలో ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పైన సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. కేసు హైకోర్టులో పెండింగులో వున్నం

రోజా క్షమాపణ లేఖ ఇచ్చారా? ఏదీ ఇక్కడ ఇవ్వగలుగుతారా? సుప్రీంకోర్టు
, గురువారం, 6 జులై 2017 (15:48 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపధ్యంలో ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పైన సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. కేసు హైకోర్టులో పెండింగులో వున్నందున ఈ కేసు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టీకరించింది. 
 
కాగా ఎమ్మెల్యే అసెంబ్లీ ఘటనపై క్షమాపణలు చెపుతూ ప్రభుత్వానికి లేఖ ఇచ్చిందని సుప్రీంకోర్టుకు రోజా తరపు న్యాయవాది విన్నవించారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది... తమకు ఆ లేఖ అందలేదని వెల్లడించారు. దీనితో సుప్రీంకోర్టు... ఏదీ ఆ క్షమాపణ లేఖను ఇప్పుడు ఇవ్వగలుగుతారా అని ప్రశ్నించింది. 
 
దీనితో సుప్రీంకోర్టు సమక్షంలో రోజా క్షమాపణలు తెలుపుతూ రాసిన లేఖను ప్రభుత్వ తరపు న్యాయవాదికి అందించారు. అనంతరం ఆ లేఖను సంబంధిత అధికారులకు పంపాలని ఆదేశించింది. మరోవైపు కేసును హైకోర్టు విచారించి, తీర్పు వెల్లడించిన తర్వాత ఇక్కడకు రావచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్టూన్ బొమ్మలు చూద్దామని ఇంట్లోకి తీసుకెళ్లి... గడియ పెట్టి ఏంచేశాడో తెలుసా?