Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

రోజా క్షమాపణ లేఖ ఇచ్చారా? ఏదీ ఇక్కడ ఇవ్వగలుగుతారా? సుప్రీంకోర్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపధ్యంలో ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పైన సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. కేసు హైకోర్టులో పెండింగులో వున్నం

Advertiesment
Supreme court
, గురువారం, 6 జులై 2017 (15:48 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపధ్యంలో ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పైన సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. కేసు హైకోర్టులో పెండింగులో వున్నందున ఈ కేసు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టీకరించింది. 
 
కాగా ఎమ్మెల్యే అసెంబ్లీ ఘటనపై క్షమాపణలు చెపుతూ ప్రభుత్వానికి లేఖ ఇచ్చిందని సుప్రీంకోర్టుకు రోజా తరపు న్యాయవాది విన్నవించారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది... తమకు ఆ లేఖ అందలేదని వెల్లడించారు. దీనితో సుప్రీంకోర్టు... ఏదీ ఆ క్షమాపణ లేఖను ఇప్పుడు ఇవ్వగలుగుతారా అని ప్రశ్నించింది. 
 
దీనితో సుప్రీంకోర్టు సమక్షంలో రోజా క్షమాపణలు తెలుపుతూ రాసిన లేఖను ప్రభుత్వ తరపు న్యాయవాదికి అందించారు. అనంతరం ఆ లేఖను సంబంధిత అధికారులకు పంపాలని ఆదేశించింది. మరోవైపు కేసును హైకోర్టు విచారించి, తీర్పు వెల్లడించిన తర్వాత ఇక్కడకు రావచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్టూన్ బొమ్మలు చూద్దామని ఇంట్లోకి తీసుకెళ్లి... గడియ పెట్టి ఏంచేశాడో తెలుసా?