Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో స్థానిక సమరానికి బ్రేకులు వేసిన సుప్రీంకోర్టు

ఏపీలో స్థానిక సమరానికి బ్రేకులు వేసిన సుప్రీంకోర్టు
, బుధవారం, 15 జనవరి 2020 (17:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సమరానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. 50 శాతానికి మించి రిజర్వేన్లు ఇవ్వడం న్యాయ సమ్మతం కాదనీ పేర్కొంది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో విచారణ జరిపాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
నవ్యాంధ్రలో స్థానిక సమరానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. అయితే, ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్ల రిజర్వేషన్లను 59.85 శాతంగా నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబరు 176ను జారీచేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కర్నూల్ కు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ప్రభుత్వం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేస్తూ స్టేకు నిరాకరించింది.
 
దీంతో పిటిషనరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. పైగా, ఈ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలంటూ వేసిన రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించి, నాలుగు వారాల్లోగా కేసు విచారణను పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"కా" చట్టంపై స్పందించిన సత్య నాదెళ్ల... నేను పెరిగిన భాగ్యనగరిలో...