Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

జయమ్మ మృతిపై శశికళపుష్ప పిటిషన్ కొట్టివేత.. చిన్నమ్మే సీఎం కావాలంటోన్న దీపక్..

తమిళనాడు దివంగత సీఎం జయలలిత డిసెంబర్ ఐదో తేదీన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. జయమ్మ మృతి అనుమానాలున్నాయని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప సుప్రీం కోర్టులో

Advertiesment
Supreme Court
, గురువారం, 5 జనవరి 2017 (12:00 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత డిసెంబర్ ఐదో తేదీన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. జయమ్మ మృతి అనుమానాలున్నాయని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌పై తీర్పును వెల్లడించింది.
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే పార్టీలో ఇంతకాలం శశికళ అనుచరులు చిన్నమ్మ సీఎం కావాలని నినాదాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి జయలలిత కుటుంబ సభ్యుల దగ్గర శశికళ సీఎం కావాలని చెప్పిస్తున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన దీపక్ తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ఆంటీ బాధ్యతలు స్వీకరిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
శశికళ అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించి మా మేనత్త జయలలిత ఆశయాలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారని దీపక్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా తమిళనాడు సీఎంగా శశికళ ఉండాలని అన్నాడీఎంకే నాయకులతో పాటు తాను కోరుకుంటున్నానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దావూద్ ఇబ్రహీం ఆస్తుల స్వాధీనం.. దౌత్య విజయమని కామెంట్ చేసిన బీజేపీ