Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరులో దారుణం : గదిలో తాళ్ల‌తో క‌ట్టేసి బ్లేడుతో తోటి విద్యార్థి గొంతుకోసిన విద్యార్థి

చిత్తూరులో దారుణం : గదిలో తాళ్ల‌తో క‌ట్టేసి బ్లేడుతో తోటి విద్యార్థి గొంతుకోసిన విద్యార్థి
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:13 IST)
చిత్తూరు జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకొచ్చింది. తోటి విద్యార్థిని గదిలో తాళ్ల‌తో క‌ట్టేసిన ఓ యువ‌కుడు అనంత‌రం బ్లేడ్‌తో అత‌డి గొంతుకోసి పారిపోయిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుడు తేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న త‌ల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిమోహ‌న్‌ని పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శ‌శిధ‌ర్‌రెడ్డి అనే విద్యార్థి వ‌ద్ద బాధితుడు సాయిమోహ‌న్ డబ్బులు తీసుకున్నాడ‌ని, ఈ విష‌యంపై వారిరువురి మ‌ధ్య కొన్ని రోజులుగా గొడ‌వ జ‌రుగుతోందని తోటి విద్యార్థులు పోలీసుల‌కి తెలిపారు. ప్ర‌స్తుతం సాయిమోహ‌*.txtన్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య స్థలం శ్రీరాముడిదే.. దీనిపై ఎలాంటి సందేహాలు సందేహాలు వద్దు: ఉమా భారతి