Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు, ఉలిక్కిపడి లేచి పరుగులు తీస్తున్న ప్రజలు

చిత్తూరు జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు, ఉలిక్కిపడి లేచి పరుగులు తీస్తున్న ప్రజలు
, గురువారం, 11 నవంబరు 2021 (20:53 IST)
మనం పడుకున్నప్పుడు భూమి నుంచి ఒక్కసారిగా వింతైన శబ్దం వస్తే ఏమవుతుంది. ఒక్కసారి భయంతో లేచి పరుగులు తీస్తాం. ఇప్పుడు ఇలాంటి ఘటనలు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలోని అబ్బగుండు గ్రామంలో చోటుచేసుకుంది. గత 10 రోజులుగా భూమి లోపల నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో తాము భయాందోళనకు గురవుతున్నట్లు స్థానిక ప్రజలు చెపుతున్నారు. 

 
ఆ వింత శబ్దాలు ప్రస్తుతం రాత్రి మాత్రమే కాకుండా పగలు కూడా భయపెడుతున్నాయి. దీనితో అధికారులకు సమాచారం అందించారు. పరిశీలించేందుకు వచ్చిన అధికారులకు కూడా ఆ శబ్దాలు రావడం విని షాక్ తిన్నారు. మైనింగ్ వల్లనే ఇలాంటి శబ్దాలు వస్తున్నట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనితో అసలు సమస్య ఏమిటో నిర్థారిస్తామని అధికారులు చెప్పి వెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌పై రూ. 5 కోట్ల ప‌రువు న‌ష్టం దావా..