Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దెయ్యం పట్టుకుందని.. మసీదు ముందు పీక కోసుకుని..?

దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్

దెయ్యం పట్టుకుందని.. మసీదు ముందు పీక కోసుకుని..?
, శుక్రవారం, 26 జనవరి 2018 (14:00 IST)
దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడు లావేరు మండలం, బుడుమూరు పంచాయతీ బొంతువలస గ్రామానికి చెందిన అల్లంశెట్టి సురేష్‌గా పోలీసులు గుర్తించారు. 
 
ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సురేష్.. ఓ అద్దె ఇంట్లో వున్నాడు. ఓ రోజు బాబాయ్‌కి ఫోన్ చేసి తన ఆరోగ్యం బాగోలేదని దెయ్యం పట్టినట్లుందని తెలిపాడు. దీంతో ఆయ‌న సురేష్‌ దగ్గరికొచ్చి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ త‌న‌ను ముట్టుకోవ‌ద్ద‌ని, ఒకవేళ ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకొంటానని సురేష్‌ బెదిరించాడు.
 
ఈ విష‌యం తెలుసుకున్న సురేష్ తండ్రి కేశవరావు అర్థరాత్రే స్వగ్రామం నుంచి బయలుదేరి తన కుమారుడు ఉంటోన్న‌ సోంపేటకు వ‌చ్చాడు. అయితే, సురేష్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో షాక్ తిన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుల బాధ తట్టుకోలేకపోయిన దివ్యాంగుడి ఆత్మహత్య