Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓన్లీ క్యాష్ పేమెంట్స్ చేస్తేనే అడ్మిషన్... కేర్ ఆస్పత్రి నిర్వాకం.. ఆగిన గుండె

Advertiesment
Sriakakulam
, బుధవారం, 28 ఏప్రియల్ 2021 (16:04 IST)
శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణం జరిగింది. జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి యజమాన్యం వ్యవహారశైలి కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కేవలం క్యాష్ పేమెంట్స్ చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామంటూ మొండికేశారు. డబ్బుకోసం ఏటీఎంల చుట్టూ మూడు గంటల పాటు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలోనే కరోనా సోకిన మహిళ ప్రాణాలు విడిచింది. దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి తీరుపై మండిపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజాం మండలం పెంట అగ్రహారం చెందిన అంజలి అనే మహిళకు కరోనా వైరస్ సోకింది. ఆమెకు శ్వాస పీల్చడంలో కాస్త ఇబ్బందిగా ఉండటంతో జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి బంధువులు తీసుకువచ్చారు. అయితే  క్యాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని కేర్ ఆసుపత్రి సిబ్బంది స్పష్టం చేశారు. 
 
ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ పేమెంట్‌ను కూడా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. కేవలం క్యాష్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామంటూ స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలి బంధువులు ఏటీఎంల చుట్టూ 3 గంటలు తిరిగారు. ఇంతలోనే బాధితురాలు అంజలికి ఊపిరి ఆడక పరిస్థితి విషమించడంతో రోడ్డుపైనే మరణించింది. 
 
ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అంటూ ప్రజల ప్రాణాలు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 108కు కాల్ చేసినా స్పందించలేదంటూ ప్రభుత్వంపై కూడా మండిపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు: సీఎం జగ‌న్‌