Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంగారెడ్డి జిల్లాలో కఠోర భూతపస్సు చేస్తున్న బాబా... గుడి బాగు కోసమట...

రంగారెడ్డి జిల్లా రావిర్యాల‌లో ''శ్రీ స‌త్యం శివం సుంద‌రం దాస్ మ‌హాత్యాగి'' అనే బాబా ఐదురోజులుగా భూత‌పస్సు చేస్తున్నారు. త‌ల మాత్ర‌మే భూమిపైకి క‌న‌ప‌డుతోంది. ఈ మహాకార్యానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం

Advertiesment
Sri Sathyam Sivam Sundharam Baba
, బుధవారం, 5 అక్టోబరు 2016 (15:16 IST)
రంగారెడ్డి జిల్లా రావిర్యాల‌లో ''శ్రీ స‌త్యం శివం సుంద‌రం దాస్ మ‌హాత్యాగి'' అనే బాబా ఐదురోజులుగా భూత‌పస్సు చేస్తున్నారు. త‌ల మాత్ర‌మే భూమిపైకి క‌న‌ప‌డుతోంది. ఈ మహాకార్యానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పరిధిలోని జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదికైంది. బాబా చేసే ఈ త‌ప‌స్సును ''ద‌స‌రా న‌వ‌రాత్రి భూత‌ప‌స్సు'' అని ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నారు. 
 
మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాత్యాగి భూతపస్సును తిలకిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు కఠోర తపస్సు చేసిన త‌ర్వాత పూజ‌లు ఉంటాయ‌ని అంటున్నారు. బాబా ఆ ఊళ్లోని గుడి బాగు కోసమే ఈ దీక్ష చేప‌ట్టిన‌ట్లు స్థానికులు అంటున్నారు. 
 
ఇన్నాళ్లూ బాబా వ‌ద్ద స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవ‌డానికి వ‌చ్చిన భ‌క్తులు ఇప్పుడు ఆయ‌న చేస్తోన్న త‌ప‌స్సును వీక్షించేందుకు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ యజ్ఞం ఫలితంగా దేశంలోని ప్రజలు ప్రకృతి వైపరిత్యాలకు గురికాకుండా ఉంటారని భూతపస్సు నిర్వహిస్తున్న మహాత్యాగి అనుచరులు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్జికల్ స్ట్రైక్స్ వీడియో ఫుటేజీలను విడుదల చేనున్న బీజేపీ సర్కారు