Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతి

BS Rao
, గురువారం, 13 జులై 2023 (21:31 IST)
BS Rao
శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతి చెందారు. బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి ఆయన ప్రాణాలు కోల్పోయారు. బాత్రూమ్‌లో కాలు జారి పడటంతో ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బీఎస్ రావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
బీఎస్ రావు అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించనున్నారు. బీఎస్ రావు కుమార్తె సీమ విదేశాల్లో వున్నారు. ఆమె వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఇంగ్లండ్, ఇరాన్ వైద్యులుగా సేవలు అందించిన బీఎస్ రావు దంపతులు 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను స్థాపించారు. 
 
మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు శ్రీ చైతన్య కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దాదాపు 8 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ మంచి భర్తను వెతికిపెడితే రూ.4 లక్షల బహుమతి ....