Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో చీప్ లిక్కర్ రూ.75లకే అమ్మాలి: సోము వీర్రాజు

Advertiesment
Somu verraju
, గురువారం, 30 డిశెంబరు 2021 (16:13 IST)
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమను మట్టుబెట్టేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆరోపించారు. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాని కోరారు. అలాగే రాష్ట్రంలో చీప్ లిక్కర్ రూ.75లకే అమ్మాలని డిమాండ్ చేశారు. 
 
2024లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని జోస్యం చెప్పారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రూ.75లకు చీప్ లిక్కర్ అమ్మనుందని స్పష్టం చేశారు. 
 
ప్రజాగ్రహ సభ ద్వారా తమ సత్తా ఏంటో చూపిస్తామని కామెంట్ చేశారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
గతంలో అంచనాలు పెంచేశారని చంద్రబాబుపై విమర్శలు చేసిన సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారని ప్ర‌శ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. పదవులు ఆశించి పని చేయలేదని.. తనకు సీఎం అవ్వాలని లేదని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సంవత్సరం వేడుకలు : హైదరాబాద్‌ నగరంలో కఠిన ఆంక్షలు