Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి బాలినేని వ‌ద్ద‌కు గుప్తా... సుభానీ ఓవ‌ర్ యాక్ష‌న్ వ‌ల్లే అంతా!

Advertiesment
somisetty subbarao gupta
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 21 డిశెంబరు 2021 (13:03 IST)
ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అనుకున్న‌ట్లే ప్లేట్ ఫిరాయించాడు. త‌నపై మంత్రి బాలినేని శ్రీనివాస్ దాడి చేయించ‌డం ఏమిట‌ని ఎదురు ప్ర‌శ్నించాడు. ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్రమానికి సుబ్బారావు గుప్తా హాజ‌ర‌య్యాడు. ఇది మంత్రి బాలినేని ఏర్పాటు చేయ‌డం ఇక్క‌డ విశేషం. 
 
 
విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి దగ్గర ప్రత్యక్షమైన సోమిశెట్టి సుబ్బారావు గుప్తా త‌న‌పై ఎటువంటి దాడి జ‌రగ‌లేద‌నే రీతిలోనే వ్య‌వ‌హ‌రించాడు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలలో మంత్రితోపాటు కేక్ కట్ చేసి సుబ్బారావు గుప్తా, సీఎంకు శుభాకాంక్షలు తెలిపాడు. మంత్రి బాలినేని తనపై దాడి చేయించార‌నే వార్తలను సుబ్బారావు గుప్తా ఖండించాడు.  
 
 
సుభాని అనే వ్యక్తి ఓవరాక్షన్ ఇంత రచ్చకు కారణం అని గుప్తా చెప్పాడు. తాను మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని వెంట వున్నాన‌ని, తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశాన‌ని చెప్పాడు. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరూ లేర‌ని, పార్టీని బతికించుకోవాల‌నే  ఆకాంక్షతో తాను ఇది చేశాన‌ని, ఇందులో ఎటువంటి దురుద్దేశ్యం లేద‌న్నాడు. 
 
 
మరో 29ఏళ్లపాటు సీఎం జగన్ సీఎం గా ఉండాల‌ని, త‌నపై దాడి విషయాన్ని పెద్ద ఇస్యూ  చేయకుండా ఉండాలని మనవి చేసుకుంటున్నాన‌ని గుప్తా చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ తొలి మరణం