Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టీసీలో అవినీతి పెరిగిన మాట వాస్తవమే : మంత్రి సిద్ధా రాఘవరావు

Advertiesment
sidda raghava rao
, మంగళవారం, 10 మే 2016 (10:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో అవినీతి పెరిగిన మాట వాస్తవమేనని ఆ రాష్ట్ర రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. ఇదే అంశంపై ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... పదేళ్ళ క్రితం నుంచే అవినీతి జరుగుతుందన్న విషయం తనకు తెలుసునని, దానిని నిర్మూలించడానికి జిల్లాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. 
 
ఏపీలో మలుపుల్లేని రహదారులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు చెప్పారు. ప్రమాదాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆన్‌లైన్‌ సేవలు, డీలరు వద్దే వాహన రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాల అమలు ద్వారా రాష్ట్రం దేశంలో రెండో స్థానం దక్కించుకున్నట్లు చెప్పారు. 3 వేల ఆర్టీసీ బస్సులను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని, పాత వాటిని సరుకుల రవాణాకు వినియోగించుకుంటామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ స్నేక్ గ్యాంగ్‌పై నేడు తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠత