Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంద్రకీలాద్రిపై 22 నుంచి శాకంబరీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై 22 నుంచి శాకంబరీ ఉత్సవాలు
, మంగళవారం, 6 జులై 2021 (09:45 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 వ తేదీ నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. కూరగాయలతో‌ చేసిన అలంకారంతో మూడు రోజులపాటు దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని దుర్గగుడి పాలకమండలి, అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి అవసరమైన కూరగాయలు, పండ్లు సేకరిస్తున్నారు. ఈ నెల 18 న తెలంగాణ రాష్ట్రం నుంచి దుర్గమ్మకు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోణం సమర్పించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రానికి జగన్ ప్రేమలేఖలు: జవహర్