Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయమ్మ సర్కారు దూకుడుకు సుప్రీం బ్రేక్... శశికళ పుష్పకు 6 వారాల వరకు రక్షణ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ దూకుడుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. విపక్ష నేతలు చేస్తున్న విమర్శలను సహించలేని జయలలిత... తమ పార్టీ నేతలతో విపక్ష నేతలపై పరువు నష్టందావా కేసులు బనాయిస్తున్న విషయ

జయమ్మ సర్కారు దూకుడుకు సుప్రీం బ్రేక్... శశికళ పుష్పకు 6 వారాల వరకు రక్షణ
, శుక్రవారం, 26 ఆగస్టు 2016 (13:25 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ దూకుడుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. విపక్ష నేతలు చేస్తున్న విమర్శలను సహించలేని జయలలిత... తమ పార్టీ నేతలతో విపక్ష నేతలపై పరువు నష్టందావా కేసులు బనాయిస్తున్న విషయం తెల్సిందే. ఈ వ్యవహారంలో జయమ్మకు సుప్రీంకోర్టు మొటిక్కాయ వేసింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ వేటుపడిన రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్పకు అనుకూలంగా తీర్పునిచ్చింది. పనిమనుషులపై పుష్ప భర్త, కొడుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసే విషయంలో తమిళనాడు పోలీసులకు సుప్రీంకోర్టు బ్రేకులేసింది. 
 
శశికళ పుష్ప దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్‌కు అప్పగించిన సుప్రీం ధర్మాసనం... పుష్ప కుటుంబ సభ్యుల అరెస్టుపై ఆరు వారాల పాటు స్టే విదించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన పార్టీ ప్రస్థానం... 27న తిరుపతిలో తొలి బహిరంగ సభ