Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసేన పార్టీ ప్రస్థానం... 27న తిరుపతిలో తొలి బహిరంగ సభ

జనసేన పార్టీ ఆధ్వర్యంలో తొలి బహిరంగ సభ జరుగనుంది. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేతిలో తన అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన

జనసేన పార్టీ ప్రస్థానం... 27న తిరుపతిలో తొలి బహిరంగ సభ
, శుక్రవారం, 26 ఆగస్టు 2016 (13:15 IST)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో తొలి బహిరంగ సభ జరుగనుంది. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేతిలో తన అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన విషయంతెల్సిందే. 
 
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్... తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీవారిని ఒక సామాన్య భక్తుడిగా దర్శనం చేసుకున్నారు. శుక్రవారం కూడా అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి తన గదికే పరిమితమయ్యారు. ఆయన ఏ ఒక్కరినీ కలువకుండా ఉన్నారు. 
 
ఈనేపథ్యంలో శనివారం తిరుపతిలో బహిరంగ సభకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు స్థానిక స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇకపై క్రీయాశీలకంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్ పద్ధతిగా ఉండేవాడు.. జగన్‌ పద్ధతిలేని వ్యక్తి: చంద్రబాబు