Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యభిచార గృహంలో పట్టుబడిన మహిళలు... చూసేందుకు ఎగబడిన స్థానికులు

చిత్తూరు జిల్లాలో భారీ సంఖ్యలో మహిళలు పట్టుబడ్డారు. వీరిని చూసేందుకు స్థానికులు ఒక్కసారి ఎగబడ్డారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టైన విషయ

Advertiesment
వ్యభిచార గృహంలో పట్టుబడిన మహిళలు... చూసేందుకు ఎగబడిన స్థానికులు
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (09:56 IST)
చిత్తూరు జిల్లాలో భారీ సంఖ్యలో మహిళలు పట్టుబడ్డారు. వీరిని చూసేందుకు స్థానికులు ఒక్కసారి ఎగబడ్డారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టైన విషయం తెల్సిందే. 
 
38 మంది వ్యభిచార గృహ నిర్వాహకులు, బ్రోకర్లు, విటులు సహా పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తోందన్న సమాచారంతో మదనపల్లెలోని పలు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించినట్టు మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. 
 
13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది యువతులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఒక్కో మహిళకు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తూ పెద్ద ఎత్తున సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రస్ట్ నడుపుతున్నానని నమ్మించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఏం చేశాడంటే...