Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా ఆసరాతో కన్నం వేస్తున్న దొంగలు, తెనాలిలో స్కూటీ, బొలెరో వాహనం మాయం

కరోనా ఆసరాతో కన్నం వేస్తున్న దొంగలు, తెనాలిలో స్కూటీ, బొలెరో వాహనం మాయం
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:01 IST)
గుంటూరు: జిల్లాలోని తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల్లో మూడు చోరీలు జరిగాయి. గత రాత్రి మారిస్ పేట పాత పోస్ట్ ఆఫీస్ వద్ద ఇంటి ముందు ఉన్న స్కూటీ చోరీకి గురైంది.

మొన్న రాత్రి టౌన్ పీఎస్ వెనుక ప్రాంతంలో రెండు చోట్ల చోరీలు జరిగాయి. టీ స్టాల్ వద్ద పాన్ షాపును పగలగొట్టిన దుండగులు నగదును అపహరించారు. ఆ పక్కనే బ్యాటరీ షాపు ముందు నిలిపి ఉంచిన బొలెరో వాహనం మాయమైంది. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పోలీసులను ఆశ్రయించిన కేసు నమోదు చేయకపోవడంపై బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయంటూ పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడాన్ని నిలిపివేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 మంది మంత్రుల మీటింగుకే కరోనా అని భయపడ్డారు, మరి 15 లక్షల మందితో పరీక్షలెలా రాయిస్తారు?: లోకేష్