Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆటో డ్రైవర్ డోర్ తీశాడు.. బైకుపై వెళ్లిన ఇద్దరు లారీ కింద పడిపోయారు.. చివరికి?

Advertiesment
Road Accident
సంగారెడ్డి జిల్లా ఐడీఎల్ బొల్లారం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షేర్ ఆటో చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సీసీటీవీలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం రికార్డు అయ్యింది. షేర్ ఆటో డ్రైవర్ వున్నట్టుండి డోర్ తెరిచాడు. దీంతో పక్కన వుస్తున్న బైకుకు తగిలింది. అంతే ఆ బైకు అదుపు తప్పింది. 
 
పక్కనే వెళ్తున్న లారీ కింద బైకులో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు పడిపోయారు. అంతే లారీ టైర్లకు బలైపోయారు. ఈ ఘటనను కళ్లారా చూసిన షేర్ ఆటో డ్రైవర్ ఏమీ తెలియనట్లు నడిచి వెళ్లాడు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని సైది రెడ్డి, లక్ష్మిగా గుర్తించారు.
 
వీరు చేర్యాల గ్రామస్తులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అజాగ్రత్తగా డోర్ తీయడంతో బైకును డోర్‌ను తాకి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెక్ డొనాల్డ్స్ చికెన్‌లో కోడి ఈకలు.. తిన్న చిన్నారి.. కడుపులో వికారం..