Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెయిల్ వచ్చేవరకు పారిపో.. ప్రొఫెసర్ లక్ష్మికి సలహా ఇచ్చిన రిటైర్డ్ జడ్జి

గుంటూరు వైద్య కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఎవరికీ చిక్కకుండా పారిపోవాల్సిందిగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మికి ఓ రిటైర్డ్ జడ్జితో పాటు ర

బెయిల్ వచ్చేవరకు పారిపో.. ప్రొఫెసర్ లక్ష్మికి సలహా ఇచ్చిన రిటైర్డ్ జడ్జి
, మంగళవారం, 15 నవంబరు 2016 (13:19 IST)
గుంటూరు వైద్య కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఎవరికీ చిక్కకుండా పారిపోవాల్సిందిగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మికి ఓ రిటైర్డ్ జడ్జితో పాటు రిటైర్డ్ పోలీసు అధికారి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులు విచారణలో ప్రొఫెసర్ లక్ష్మి బహిర్గతం చేసింది. అయితే, ఆ రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీసు అధికారి పేర్లను మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు. 
 
సంధ్యారాణి ఆత్మహత్య తర్వాత పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సంధ్యారాణి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలు స్పష్టంగా పేర్కొంది. దీంతో ఈ కేసులో బెయిల్ వచ్చే వరకూ పోలీసులకు లొంగిపోకుండా పారిపోవాలని రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీసు అధికారి చెప్పారు. వారు చెప్పిన మాట వినే, లక్ష్మి దంపతులు గుంటూరును వీడి వెళ్లారని పోలీసు వర్గాలు విచారణలో తెలుసుకున్నాయి. ఇక గుంటూరును వీడిన ఈ దంపతులు 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో తిరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.500 ఇస్తే రాళ్లు రువ్వే ముఠాలకు కళ్లెం.. డబ్బుల్లేక సైలెంట్‌గా?: మనోహర్ పారికర్