Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శేషాచలంలో మళ్ళీ అలజడి... ఏం జరిగిందో తెలుసా..?

శేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20 మంది ఎన్‌కౌంటర్ తర్వాత ఒక్కసారిగా శేషాచలం పేరు మారుమ్రోగింది. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు శేషాచలం కొండలు. శేషుడు (శ్రీనివాసుడు) కొలువై ఉన్న ప్రా

శేషాచలంలో మళ్ళీ అలజడి... ఏం జరిగిందో తెలుసా..?
, బుధవారం, 31 మే 2017 (14:10 IST)
శేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20 మంది ఎన్‌కౌంటర్ తర్వాత ఒక్కసారిగా శేషాచలం పేరు మారుమ్రోగింది. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు శేషాచలం కొండలు. శేషుడు (శ్రీనివాసుడు) కొలువై ఉన్న ప్రాంతం ఈ కొండలు. ఈ కొండల మధ్య నుంచే భక్తులు తిరుమలకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎర్రచందనం స్మగ్లర్లు మరింత రెచ్చిపోయి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేస్తున్నారు.   ప్రాణాలను పోగొట్టుకోవడానికి, ప్రాణాలు తీయడమో చేస్తున్నారు. కోడిని చంపిన ఈజీగా పోలీసులను చంపేస్తున్నారు ఎర్రస్మగ్లర్లు. 
 
తాజాగా భాకరాపేట ఘాట్ రోడ్డులోని గద్దెగూడ బండల సమీపంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. తెల్లవారుజామున ఎర్రకూలీలు తారసపడ్డారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్ళలు, గొడ్డలతో పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌పై దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. చివరకు కొంతమంది ఎర్రకూలీలు అడవుల్లోకి పారిపోయారు. ఇద్దరు మాత్రం పోలీసులకు దొరికారు. నిందితుల నుంచి 18 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : 80 మంది మృతి, ౩౦౦ మందికి పైగా క్షతగాత్రులు