మాయమాటలతో విద్యార్థినితో పెళ్లి.. తొలిరాత్రి ముగిశాక.. కులం పేరుతో దూషించి.. వదిలేశాడు
ఓ కామాంధుడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తొలి రాత్రి ముగిశాక కులం పేరుతో దూషించి వదిలేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఓ కామాంధుడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తొలి రాత్రి ముగిశాక కులం పేరుతో దూషించి వదిలేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
వరంగల్కు చెందిన ఓ యువతి నంద్యాలలో ఓ కోచింగ్ సెంటర్లో బ్యాంకు ఉద్యోగాల పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటోంది. నంద్యాల పరిధి దిన్దేవరపాడుకు చెందిన పెరుగు అరవింద్ రెడ్డి ఆమెతో పరిచయం పెంచుకుని, రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఎల్బీనగర్ కామినేని చౌరస్తా సమీపంలో గల ఆర్టీసీ కాలనీలో ఓ గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. ఆమెతో గడిపినపుడు రహస్యంగా వీడియోలు కూడా తీశాడు.
తర్వాత కొన్నాళ్లకు ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎన్నిరోజులైనా అరవింద్ రెడ్డి రాకపోవడంతో ఆమె ఫోన్ చేసి ఎందుకు రావడంలేదని అడిగింది. ‘నేను అగ్రకులానికి చెందినవాడిని’ అని అంటూ, ఆమెను కులం పేరుతో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా మనం దూరంగా ఉండడమే మంచిదని ఆమెకు ఉచిత సలహా ఇచ్చాడు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన వద్ద ఉన్న వీడియోలను నెట్లో పెడతానంటూ బెదిరించాడు. ఏమిచేయాలో తోచక ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆదివారం రాత్రి బాధితురాలి ఫిర్యాదుతో కులం పేరుతో దూషించి వదిలి వెళ్లిన యువకుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.