Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతికెళ్లి తిరిగిరాదనీ.. ప్రియురాలిని కడతేర్చిన ప్రేమోన్మాది

తన ప్రియురాలు సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లితే ఇక తిరికిరాదనీ భావించిన ఓ ప్రేమోన్మాది ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ హబీబ్‌నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్త

సంక్రాంతికెళ్లి తిరిగిరాదనీ.. ప్రియురాలిని కడతేర్చిన ప్రేమోన్మాది
, బుధవారం, 10 జనవరి 2018 (19:41 IST)
తన ప్రియురాలు సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లితే ఇక తిరికిరాదనీ భావించిన ఓ ప్రేమోన్మాది ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ హబీబ్‌నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శ్రీకాకుళం జిల్లా రాజం మండలం వలస గ్రామానికి చెందిన బోను జానకి (24), గొరెండి గ్రామానికి చెందిన బొడ్డెపల్లి రూప (27) అనే ఇద్దరు యువతులు మూసాపేట్‌లోని శక్తి నగర్‌లో నివాసముంటున్నారు. జానకి, రూప ఇద్దరూ డీమార్ట్‌లో సేల్స్ గర్ల్స్‌గా పని చేస్తూ ఇంటికి ఆసరాగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో అదేప్రాంతానికి చెందిన అనంతప్ప అనే యువకుడు జానకిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని చెప్పగా జానకి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అనంతప్ప.. తన ప్రేమను అంగీకరించకపోతే జానకిని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఇటీవలే బెదిరించాడు. 
 
ఈనేపథ్యంలో మంగళవార రాత్రి జానకి రూంకి వెళ్లిన అనంతప్ప.. మాట్లాడాలని కబురెట్టడంతో ఆమె బయటకు వచ్చింది. గది నుంచి బయటకు రాగానే విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపాడు. ఇంతలోనే రూప తన విధులు ముగించుకుని రూం వద్దకు వచ్చి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టురాలైంది. 
 
ఆ తర్వాత తేరుకుని జానకిని చికిత్స నిమిత్తం శక్తి నగర్‌లోని వసుంధర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే జానకి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కత్తితో పొడిచి ఆపై అత్యాచారం చేసిన కామాంధుడు