Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ హైకోర్టును చంద్రబాబే ఏర్పాటు చేయాలి : సదానంద గౌడ

ఏపీ హైకోర్టును చంద్రబాబే ఏర్పాటు చేయాలి : సదానంద గౌడ
, గురువారం, 26 మే 2016 (09:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... విభజన చట్టం ప్రకాం ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకు వెళుతుందని… కొత్తగా ఏపీకి హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 
 
ఏపీకి హైకోర్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వసతులు కల్పిస్తామని అంటోందని… అందుకు ఏపీ సీఎం అంగీకరించాలి కదా అన్నారు. అయినా ఈ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందని, కోర్టు ఏం చేబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 
 
ఈ విషయంలో ఏపీపై మీరు ఒత్తిడి చేయొచ్చు కదా అని విలేకరులు అడగ్గా… నేను ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేనన్నారు. మొత్తానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి సమాధానాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, ప్రభుత్వం ఎంతగా ఒత్తిడి చేసినా… తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్రం చేయగలిగిందేమీ లేదని తేటతెల్లమైపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోదా ఇచ్చే ప్రసక్తే లేదు.. నిధులు మాత్రం ఇస్తాం... 2017 నాటికి ఆ రాష్ట్రాలు ఉండవు: పురంధేశ్వరి