Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్‌3 వీ సేఫ్టీ టెన్నెల్‌

పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్‌3 వీ సేఫ్టీ టెన్నెల్‌
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:03 IST)
మహమ్మారి కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పలు చోట్ల ఎస్‌3 వీ సేఫ్టీ టన్నెళ్లను ప్రవేశ పెట్టింది. తాజాగా మంగళగిరిలోని  పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దృష్టి సారించారు.

సూక్ష్మ క్రిములను నివారించే ఎస్3వీ  సేఫ్ టన్నెల్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి.

ఈ టన్నెల్‌లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్‌ను అభివృద్ధి చేసిన కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఇకపై డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్‌ నుంచే రావాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#ModiLeadingTheWorld ట్విట్టర్లో టాప్ ట్రెండ్, ఎందుకని?