Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుయా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్

రుయా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్
, మంగళవారం, 11 మే 2021 (15:44 IST)
ఆక్సిజన్ సరఫరాలో సమస్య కారణంగా తిరుపతి ఆసుపత్రిలో మరణించిన 11 మంది కోవిడ్ -19 రోగుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ .10 లక్షల నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సోమవారం రాత్రి రుయా ఆసుపత్రిలోని ఐసియు లోపల ఆక్సిజన్ సరఫరాలో సమస్య కారణంగా 11 మంది కోవిడ్ -19 రోగులు మరణించిన సంగతి తెలిసిందే. 
 
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రీలోడ్ చేయడంలో ఐదు నిమిషాల ఆలస్యం జరిగిందని, దీనివల్ల మరణాలు సంభవించాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. మరోవైపు 11 మంది కోవిడ్ -19 రోగుల మరణానికి కారణమని అన్ని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా నిందించాయి.
 
వారి మరణాలను "ప్రభుత్వ హత్యలు" అని ఆరోపించడంతో పాటు ప్రజల ప్రాణాలను రక్షించలేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో సంపూర్ణ లాక్డౌన్.. దుకాణాలు మాత్రం... : కేబినెట్ నిర్ణయం