Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ బొమ్మతో రూ.వంద నాణెం.. గెజిట్ రిలీజ్ చేసిన కేంద్రం

ntr coin
, బుధవారం, 22 మార్చి 2023 (12:32 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెంను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం అధికారికంగా ఓ గెజిట్‌ను కూడా జారీ చేసింది. ఈ నాణెం 44 మిల్లీ మీటర్లు చుట్టు కొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి, 40 శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం ఇతర లోహాలు ఉంటాయని కేంద్రం వివరించింది. 
 
ఈ నాణెంకు ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం, మరోవైపు, ఎన్టీఆర్ ఫోటో చిత్రం దాని కింద శ్రీ రామారావు శతజయంతి అని హిందీ భాషలో 1923 - 2023 అని ముద్రిస్తారు. ఈ విషయాన్ని కేంద్రం జారీచేసిన గెజిట్‌లో వివరించింది. ఉగాది పండుగ రోజున ఈ విషయం వెల్లడించడంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీ కార్గో సిబ్బంది చేతివాటం : 51 కేజీల జామకాయలకు గాను... 21 కేజీలే చేరాయి..