Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాల ప్యాకెట్ కోసం వెళ్తే కొమ్మ వచ్చి విరిగిపడింది.. రోడ్డు దాటుతుంటే కారొచ్చి ఢీకొంది.. ఇద్దరు బాలురు మృతి

విజయవాడ, చీరాలలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ సత్యనారాయణపురంలో మంగళవారం ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు తన సైకిల్‌పై వెళుతున్న 12 ఏళ్ల బాలుడు హర

పాల ప్యాకెట్ కోసం వెళ్తే కొమ్మ వచ్చి విరిగిపడింది.. రోడ్డు దాటుతుంటే కారొచ్చి ఢీకొంది.. ఇద్దరు బాలురు మృతి
, మంగళవారం, 20 జూన్ 2017 (12:57 IST)
విజయవాడ, చీరాలలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ సత్యనారాయణపురంలో మంగళవారం ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు తన సైకిల్‌పై వెళుతున్న 12 ఏళ్ల బాలుడు హర్షపై ఓ చెట్టు విరిగిపడింది. దాని కొమ్మలు బాలుడి గొంతులోకి గుచ్చుకుపోవడంతో.. ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన శిశువిద్యామందిర్ వద్ద జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించినా, అప్పటికే బాలుడి ప్రాణాలు పోయాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని వారు విమర్శిస్తున్నారు. 
 
అలాగే ప్ర‌కాశం జిల్లా చీరాల బైపాస్ వాడ‌రేవు జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు రోడ్డు దాటుతుండ‌గా వేగంగా వ‌చ్చిన కారు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. కారు ఢీకొన్న ఈ ఘటనలో కొండేటి యానాదిరావు అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌పై మానవరహిత విమానాలతో దాడులు చేయండి : డోనాల్డ్ ట్రంప్