Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు...

వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు...
, సోమవారం, 27 మే 2019 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోయాయి. రోహిణి కార్తె ప్రారంభంకావడంతో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజులోనే 18 మంది పిట్టల్లా రాలిపోయారు. మరో రెండు రోజుల పాటు ఎండల తీవ్ర ఇదేవిధంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలుచోట్ల రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతుల రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనీ, వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆర్జీటీఎస్ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 44 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలు పగటిపూట అత్యవసరమైతేనే బయటకు రావాలని లేనిపక్షంలో గృహాలకే పరిమితం కావాలని కోరింది. 
 
మరోవైపు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపూరు జిల్లాల్లో ఎండలు అదరగొడతాయని ఆర్జీటీఎస్ హెచ్చరించింది. ఇదిలావుంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరైనా సరే.. తోలు తీసేయండి : జగన్‌ ఆదేశాలు