Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14 ఏళ్ల తనూజ యువకుడితో కలిసి కనిపించింది... తల్లి మందలిస్తే అలిగి వెళ్ళింది... శవమై కనిపించింది(Video)

పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధి కృష్ణరాయపురంలో దారుణ‌మైన‌ ఘటన నగరవ్యాప్తంగా సంచలనం రేపింది. కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ (14

14 ఏళ్ల తనూజ యువకుడితో కలిసి కనిపించింది... తల్లి మందలిస్తే అలిగి వెళ్ళింది... శవమై కనిపించింది(Video)
, సోమవారం, 25 జులై 2016 (16:59 IST)
పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధి కృష్ణరాయపురంలో దారుణ‌మైన‌ ఘటన నగరవ్యాప్తంగా సంచలనం రేపింది. కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ (14) పురుషోత్తపురంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు నడుచుకుని వెళ్లివస్తుంది. 
 
శనివారం తనూజ పాఠశాల నుంచి ఓ యువకుడితో కలిసి వస్తుండగా ఆమె అక్క చూసింది. విషయాన్ని తల్లికి చెప్పడంతో శనివారం రాత్రి తనూజని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన తనూజ ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
 
అయితే అదే అపార్ట్‌మెంట్ వద్ద ఆమె స్నేహితురాలు ఉంటున్న ఫ్లాట్‌కి కింద ఉన్న గోడకు ఆనుకుని తనూజ మృతదేహం ఆదివారం ఉదయం కనిపించింది. దీంతో స్థానికులు తనూజ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దిలీప్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుడి తల్లిదండ్రులను కూడా ప్రశ్నిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#IndiasMostLovedCEO... రజినీకాంత్..? ముఖేష్ అంబానీయా...? కబాలి నిప్పురా...?