Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Advertiesment
Rains

సెల్వి

, సోమవారం, 12 మే 2025 (19:07 IST)
తెలుగు ప్రజలకు శుభవార్త. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్- తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. వర్షానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడిందని పేర్కొంటూ, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. 
 
హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, తాండూర్, మెదక్, మేడ్చల్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం వేళల్లో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం ప్రారంభమవుతుంది. తిరుపతి- కడపలో వర్షం పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
 
ఇకపోతే.. ఈ ఏడాది మే 27న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతంలో 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు