Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ వ్యాప్తంగా రైళ్ల స్పీడ్​ 160 కి.మీ : సౌత్ సెంట్రల్ జీఎం

దేశ వ్యాప్తంగా రైళ్ల స్పీడ్​ 160 కి.మీ : సౌత్ సెంట్రల్ జీఎం
, ఆదివారం, 1 డిశెంబరు 2019 (12:33 IST)
దేశవ్యాప్తంగా రైళ్ల వేగం 130 నుంచి 160 కిలో మీటర్లకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మాల్యా తెలిపారు. 2022 వరకు కాజీపేట, బల్లార్ష జంక్షన్ల మధ్య మూడో రైల్వే లైన్​ పనులు పూర్తి చేస్తామన్నారు. మనోహరాబాద్​, నిజామాబాద్​ మీదుగా పెద్దపల్లి వరకు రైల్వే లైన్​ను ఆయన పరిశీలించారు. 
 
రెండున్నరేళ్ల క్రితం పూర్తయిన నిజామాబాద్ - పెద్దపల్లి రైల్వే లైన్​ పనులు పరిశీలించి సంతృప్తిగా ఉన్నాయని అన్నారు. కొత్త రైలు మార్గంలో రైళ్ల వేగం 50 నుంచి 70 కిలో మీటర్లకు పెంచడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 
 
ప్రస్తుతం పెద్దపల్లి నుంచి జగిత్యాలలోని లింగంపల్లి వరకు రైల్వే లైన్​ఎలక్ట్రికల్​ పనులు పూర్తయ్యాయని చెప్పారు. లింగంపల్లి నుంచి నిజామాబాద్​ వరకు ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పెద్దపల్లి-నిజామాబాద్​మార్గంలో లింగంపల్లి, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లిలో గూడ్స్​షెడ్లు నిర్మించాలని డిమాండ్​ ఉందని, వీటిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 
 
న్యూఢిల్లీ నుంచి చైన్నయ్​ వరకు, ఢిల్లీ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి కలకత్తా, కలకత్తా నుంచి చైన్నయ్​, చైన్నయ్​ నుంచి ముంబై మార్గాల్లో రైళ్ల వేగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొదట 130 కిలో మీటర్లకు తర్వాత 160 కిలో మీటర్లకు వేగం పెంచాలని భావిస్తున్నామని తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో ఈ రూట్లలో ఉన్న అన్ని లెవల్​ క్రాసింగ్​లను మూసి వేస్తామని, పాలసీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని అన్నారు.  సికింద్రాబాద్​ నుంచి తిరుపతి, షిర్డీ రైళ్ల కోసం డిమాండ్​ఉందని, కొత్త రైళ్లు నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఆర్నెల్ల పాలన.. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం