Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ‌న‌వ‌రి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

జ‌న‌వ‌రి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
, సోమవారం, 18 జనవరి 2021 (20:23 IST)
భక్తుల సౌకర్యార్థం ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జ‌న‌వ‌రి 20న బుధ‌‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా, అదేరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల బుకింగ్ కోటాను విడుద‌ల చేస్తారు. 
 
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.
 
ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై ఈవో స‌మీక్ష‌
తిరుమ‌ల‌లోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సోమ‌వారం తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 
 
ఈ సంద‌ర్భంగా టాటా, టెక్ మ‌హింద్రా సంస్థ‌లు సంయుక్తంగా మ్యూజియం అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. మ్యూజియంలోని గ్రౌండ్‌, మొద‌టి అంత‌స్తు, రెండో అంత‌స్తుల‌ను 6 జోన్లుగా విభ‌జించి గ్యాల‌రీలు ఏర్పాటు చేయాల‌ని ఈవో సూచించారు.

భ‌క్తులు లోనికి ప్ర‌వేశించ‌గానే స్వామివారి దివ్య‌వైభ‌వాన్ని వీక్షించి త‌రించేలా, ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేయాల‌ని కోరారు. శ్రీ‌వారి ఆల‌యం, వాహ‌నాలు, సేవ‌లు, స‌ప్త‌గిరుల‌కు సంబంధించి వ‌ర్చువ‌ల్ అనుభ‌వం పొందేలా ఉండాల‌న్నారు. మ్యూజియం లోప‌ల ఇంటీరియ‌ర్‌, వెలుప‌ల ప‌చ్చ‌ద‌నం పెంపుపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ఈవో కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్ర‌వ‌రి 19న తిరుమ‌ల‌లో రథసప్తమి... ద‌ర్శ‌న టోకెన్లు గ‌ల భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి