Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒంటి మీద 25 కేజీల బంగారం.. శ్రీవారి ఆలయానికి గోల్డ్ మెన్ ఫ్యామిలీ

Gold Man

సెల్వి

, శుక్రవారం, 23 ఆగస్టు 2024 (15:47 IST)
Gold Man
సాధారణంగా బంగారం అంటే మహిళలకు చాలా ప్రీతి. బంగారం ధరిస్తే గౌరవం, మర్యాద లభిస్తుందని అనుకుంటారు. ఒంటిపై బంగారం ధరించి, తమ వాళ్ల ముందే తమ స్టేటస్‌ను ప్రత్యేకంగా చూపించాలనుకుంటారు. ఇక్కడ ఓ ఫ్యామిలీ.. తన ఫ్యామిలీ వాళ్లతోనే కాకుండా.. తిరుమల వెంకన్న ముందే భారీగా బంగారం ధరించి కనిపించింది. 
 
తిరుమలలో పూణేకు చెందిన వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే.. వారు స్వామి వారిని ఉదయం పూట దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్‌తో పాటు.. మరో మహిళ సైతం ఉన్నారు. వారి ఒంటి మీద దాదాపు.. 25 కేజీల బంగారం ధరించినట్లు తెలుస్తుంది. 
 
మొత్తంగా వారి ఒంటి మీద దాదాపు..రూ. 15 కోట్ల విలువైన బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. వీరి చుట్టుపక్కల పదిహేను మంది సెక్యురిటీ సిబ్బంది సైతం వున్నారు. గోల్డ్ ధరించడంతో పాటు గోల్డ్ రంగు చీరలో కనిపించడం స్పెషల్ అట్రాక్షన్. 
 
పూణేకు చెందిని గోల్డ్ మెన్ ఫ్యామిలీ అలా తిరుమలలో కనిపించడం అక్కడున్న భక్తులను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూణేకు చెందిన వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్‌లు బిజినెస్ లు, రియల్ ఎస్టేట్ రంగంలో అనేక బిజినెస్ లు ఉన్నాయని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల కోసం కూలీగా పని చేసేందుకు సిద్ధం : డిప్యూటీ సీఎం పవన్