Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీకామ్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్-జలీల్‌కు‌‌ తోడుగా రామాంజనేయులు.. 20 సంవత్సరాలు బువ్వ తినలేదట.. ఓన్లీ పాలే?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజల నోళ్ళల్లో నానుతున్నారు. మొన్నటికి మొన్న బీకామ్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందంటూ జలీల్ ఖాన్ అనే ఎమ్మెల్యే వ్య

బీకామ్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్-జలీల్‌కు‌‌ తోడుగా రామాంజనేయులు.. 20 సంవత్సరాలు బువ్వ తినలేదట.. ఓన్లీ పాలే?
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (09:00 IST)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజల నోళ్ళల్లో నానుతున్నారు. మొన్నటికి మొన్న బీకామ్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందంటూ జలీల్ ఖాన్ అనే ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీకామ్‌లో ఏ సబ్జెక్టు వుంటుందో కూడా తెలియని వ్యక్తి ఎలా ఎమ్మెల్యే అయ్యారని పలువురు విమర్శలు గుప్పించారు. మరికొందరు నవ్వుకున్నారు. అయినా.. సదరు ఎమ్మెల్యే మాత్రం ఏం జరగనట్లు వుండిపోయారు. 
 
తాజాగా టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే.. 20ఏళ్ల పాటు భోజనమే చేయలేదని.. వట్టి పాలు మాత్రమే తాగానని చెప్తూ చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. తాను పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ల వయస్సు వచ్చేదాకా అన్నం తినలేదని.. మానేశానని.. అసలు అన్నం ఎలా తినాలో తెలియదన్నట్లు కామెంట్స్ చేశారు. ఓన్లీ పాలు మాత్రమే తాగి పెరిగానని చెప్పారు. 
 
20 సంవత్సరాలకు తర్వాత అన్నం ఎందుకు తిన్నానంటే..? అది కూడా పెళ్లి వల్లే అంటున్నారు.. భీమవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పలుపర్తి రామాంజనేయులు. అన్నం తినకపోతే.. పెళ్లికాదని ఎవరో చెప్తే భయపడి భోజనం చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాత్రిపూట పాలు మాత్రమే తాగుతున్నానని రామాంజనేయులు చెప్పారు. రామాంజనేయులు కామెంట్స్‌పై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క రాత్రి గడిపితే రూ.లక్ష... ఆఫర్ తిరస్కరిస్తే ఫెయిల్.. విద్యార్థినులకు ప్రొఫెసర్ల మెసేజ్‌లు