Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

459వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

459వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు
, శనివారం, 20 మార్చి 2021 (10:05 IST)
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 459వ రోజుకు చేరుకున్నాయి.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.

మరోవైపు విశాఖ ఉక్కు సాధిస్తామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ  అమరావతి రైతులు, మహిళలు రిలే దీకలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూల్ డ్రింక్ ప్రియులకు షాకిచ్చే వార్త.. థమ్స్ అప్ బాటిల్‌లో పాము!