Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ అభిమాని అంత్యక్రియలకు వెళ్లారు... అది చూసి షాక్ అయ్యారు...

సినీ నటుడు ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఫ్లెక్సీ కడుతున్న ఓ అభిమాని విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతడి బంధువులు శ్మశానవాటిక నుంచి స్నానానికి వెళ్లగా చెరువులో ఓ బాలుడి మృతదేహం చూ

ప్రభాస్ అభిమాని అంత్యక్రియలకు వెళ్లారు... అది చూసి షాక్ అయ్యారు...
, సోమవారం, 24 అక్టోబరు 2016 (10:51 IST)
సినీ నటుడు ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఫ్లెక్సీ కడుతున్న ఓ అభిమాని విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతడి బంధువులు శ్మశానవాటిక నుంచి స్నానానికి వెళ్లగా చెరువులో ఓ బాలుడి మృతదేహం చూసి షాకయ్యారు. కాకినాడలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
కాకినాడ జగన్నాథపురం అన్నమ్మఘాటీ సెంటర్‌ దుర్గాదేవి వీధికి చెందిన గుత్తుల దుర్గబాబు(34)కు భార్యలక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా అతడు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దుర్గబాబు హీరో ప్రభాస్‌ అభిమాని. ఆదివారం ప్రభాస్‌ పుట్టినరోజు కావడంతో శనివారం రాత్రి తన ఇంటి సమీపంలో కరెంటు స్తంభం ఎక్కి ఫ్లెక్సీ కడుతుండగా హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. 
 
స్థానికులు దుర్గబాబును 108 వాహనంపై జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ అంత్యక్రియలు ముగించుకుని చెరువులో స్నానానికి వెళ్లగా అక్కడ ఓ పసిబాలుడి మృతదేహాన్ని చూసి వారు షాక్ అయ్యారు. స్థానికంగా ఉండే ఓ వేద పాఠశాలకు చెందిన విద్యార్థిగా ఆ బాలుడిని గుర్తించారు. దీనిపై కాకినాడ వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏఎస్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుక్క ఫోటో... పోటీ పడుతున్న యాడ్ కంపెనీలు