Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూన్ 4న మా దేవుడు పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు.. పిఠాపురం ఓటర్లు

Pawan kalyan

ఠాగూర్

, గురువారం, 23 మే 2024 (17:33 IST)
జూన్ నాలుగో తేదీన మాకు పెద్ద పండుగే అని అంటున్నారు పిఠాపురం వాసులు. ఆ రోజున మా దేవుడు పిఠాపురంలో అడుగుపెడుతున్నాడు అని వారు అంటున్నారు. ఆ రోజున మా ఊరికి పెద్ద పండుగే. మేకలు లెగుస్తాయో, కోడులు లెగుస్తాయో తెలియదు.. ఆ రోజు మాకు పండగే. మా దేవుడు పిఠాపురంలో అడుగుపెడుతున్నాడు అని పిఠాపురం ఓటర్లు ఉంటారు. 
 
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అధికార వైకాపా తరపున వంగా గీత పోటీ చేశారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఇందులో వార్ వన్‌సైడ్ అన్నట్టుగా పోలింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 2.30 లక్షల ఓట్లకు గాను, 2.10 లక్షల ఓట్ల వరకు పోలైయ్యాయి. 
 
వీటిలో 80 నుంచి 90 శాతం ఓట్లు ఒక్క పవన్‌కు పడినట్టు పిఠాపురం వాసులు చెపుతున్నారు. పైగా తమ జీవితకాలంలో అభిమానంతో ఓటు వేయడం అనేది మేం పుట్టాక ఎన్నడూ చూడలేదని, ఈ ఎన్నికల్లో మాత్రం పిఠాపురంలో చూశామని, అది కూడా మా దేవుడు పవన్ కోసం ఓటు వేశామని చెప్పారు. పిఠాపురం ప్రజలు చెబుతున్నట్టు ప్రజలంతా పవన్‌కు ఓటు వేస్తే మాత్రం ఆయనకు వచ్చే మెజార్టీ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా రికార్డుపుటలకెక్కనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్!!