Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోహిత్ సోదరుడికి ఉద్యోగమెలా ఇస్తారు : ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలు

Advertiesment
PIL
, బుధవారం, 11 మే 2016 (09:31 IST)
ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంటర్ విశ్వవిద్యాలయానికి చెందిన దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల సోదరుడికి కారుణ్య జాబితాలో ఉద్యోగం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 
 
సోదరుడిని కోల్పోయి కష్టాల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ రోహిత్ తమ్ముడు చేసుకున్న విజ్ఞప్తి మేరకే కొలువు ఇచ్చామన్న ప్రభుత్వం ప్రకటననూ పిటిషనర్‌ ఖండించారు. అలాంటి విజ్ఞాపన ఏదీ రోహిత్ కుటుంబం నుంచి రాలేదన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొన్నారని అవధ్‌ కౌశిక్‌ అనే న్యాయవాది తన పిటిషన్‌లో ఆరోపించారు. 
 
హెచ్‌సీయూ పరిశోధక విద్యార్థి రోహిత ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం రోహిత్ సోదరుడు రాజా చైతన్య కుమార్‌కు నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం తెలిసిందే. అయితే, ప్రభుత్వ చర్య.. ప్రతిభావంతులైన ఢిల్లీ యువత హక్కులకు భంగకరమని పిటిషనర్‌ వాదించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం జలాశయాన్ని నింపకూడదు : ప్రకాష్ జావదేకర్