జగన్ నల్లధనం మూలాలను బయటపెట్టాలి.. వైకాపాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాల్సిందే
వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన నల్లధనం మూలాలను బయటపెట్టాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీని త్వరలోనే ఓఎల్ఎక్స్లో అమ్మకాన
వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన నల్లధనం మూలాలను బయటపెట్టాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీని త్వరలోనే ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టక తప్పదన్నారు. జగన్ను ఇన్కమ్ ట్యాక్స్ విభాగం, ఎన్ఫోర్స్ మెంట్ విభాగం వదిలిపెట్టవని, త్వరలో ఆయన జైలుకెళ్లక తప్పదని పయ్యావుల కేశవ్ తెలిపారు. అసలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను బయటపెట్టాలని కేశవ్ డిమాండ్ చేశారు.
మరోవైపు జగన్ అవినీతి ఏపీ నుంచి యూపీ వరకు పాకిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మీడియా తాజాగా బయటపెట్టిన ఆనందకుమార్ అవినీతి భాగోతం విషయంలో తీగ లాగితే డొంకంతా కదిలినిట్లు జగన్ అక్రమాలు వెలుగు చూశాయన్నారు. జగన్మోహన్రెడ్డి సూట్ కేసు కంపెనీలైన డెల్టాన్, ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, భాస్కర్ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కంపెనీల అవినీతి భాగోతం మరోసారి బయటపడిందన్నారు. టీడీపీ గతంలోనే ప్రచురించిన రాజా ఆఫ్ కరెప్షన్లో వీటిని ప్రస్తావించామన్నారు.