Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ సీఎం అంటూ నినాదాలు... పాదయాత్ర కాదు కారు యాత్రను కూడా చేయనివ్వరు... పవన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉద్దానం కిడ్నీ బాధితుల విషయమై చర్చించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ సమస్యను వెలుగులోకి తెచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ... ఆ సమస్య మీడియా ద్వారా తెలుసుకని తన వంతు

పవన్ సీఎం అంటూ నినాదాలు... పాదయాత్ర కాదు కారు యాత్రను కూడా చేయనివ్వరు... పవన్
, సోమవారం, 31 జులై 2017 (17:16 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉద్దానం కిడ్నీ బాధితుల విషయమై చర్చించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ సమస్యను వెలుగులోకి తెచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ... ఆ సమస్య మీడియా ద్వారా తెలుసుకని తన వంతు కృషి చేయడంతో సమస్యకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు. సమస్యను నిర్మూలించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
 
ఆ తర్వాత మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు 2 శాతం ఓట్లు కూడా రావని కొన్ని పార్టీలు అంటున్నాయే అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... 2 శాతం ఓట్లు వస్తాయని చెప్పినందుకు సంతోషంగానే వుందన్నారు. కనీసం 2 శాతమైన వస్తాయని అన్నారు కదా అంటూ సెటైర్లు వేశారు. 
 
ఇకపోతే ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టబోతున్నారు... మరి మీరు కూడా పాదయాత్ర చేస్తారా అని అడిగిన ప్రశ్నకు పవన్ మాట్లాడుతూ... తను పాదయాత్ర కాదు... కనీసం కారు యాత్రను కూడా చేయనివ్వరు. రోడ్లపైకి వస్తే చుట్టేస్తారు. అందువల్ల ఏవిధంగా ప్రజల వద్దకు వెళ్లాలో ఆలోచన చేసుకుని ముందుకు వెళతానని తెలిపారు.
 
పవన్ మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలు.. పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. అలా నినాదాలు చేస్తున్నవారిని పవన్ కళ్యాణ్ వారించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్‌లో తమిళనాడు సీన్.. రిసార్ట్‌లో 44 మంది ఎమ్మెల్యేలు.. అమిత్ షా ఫైర్