Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరు శేశేంద్ర శర్మ పుస్తకంపై పవన్ ఆసక్తి... దొరకడంలేదని ఆవేదన... అలా చేస్తున్నారట...

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పుస్తకాలను చదివే వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్ పేర్లు ఎక్కువగా చెపుతూ ఉంటారు. వీరు షూటింగ్ విరామ సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతూ కనిపిస్తుంటారట. ఏవో పిచ్చాపాటి మాటలతో సమయాన్ని గడిపేయకుండా పుస్తక పఠనం చేస్తుం

గుంటూరు శేశేంద్ర శర్మ పుస్తకంపై పవన్ ఆసక్తి... దొరకడంలేదని ఆవేదన... అలా చేస్తున్నారట...
, మంగళవారం, 31 మే 2016 (19:52 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పుస్తకాలను చదివే వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్ పేర్లు ఎక్కువగా చెపుతూ ఉంటారు. వీరు షూటింగ్ విరామ సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతూ కనిపిస్తుంటారట. ఏవో పిచ్చాపాటి మాటలతో సమయాన్ని గడిపేయకుండా పుస్తక పఠనం చేస్తుంటారట. అలాగే ఈమధ్య పవన్ కళ్యాణ్ ఆధునిక మహాభారతం పుస్తకాన్ని చదవాలనుకున్నారట. 
 
ఆ పుస్తకం కోసం ఎన్నిచోట్ల వాకబు చేసినా దొరకలేదట. దాంతో పుస్తకాన్ని రచించిన గుంటూరు శేశేంద్ర శర్మ కుమారుడికి ఫోన్ చేశారట పవన్. అంత గొప్ప పుస్తకం మార్కెట్లో దొరక్కపోవడం ఏంటని ప్రశ్నించిన పవన్, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలని చెప్పారట. దీనికయ్యే ఖర్చు కూడా తనే భరిస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ కారణంగా మరుగున పడిన పుస్తకాలకు తిరిగి ప్రాణాలు వస్తున్నాయన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగ్నంగా సైకిల్ తొక్కిన భారత మహిళ.. రికార్డు సరే.. విమర్శల సంగతేంటి?