Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు... పవన్ కళ్యాణ్ కన్నీరు

రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని

ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు... పవన్ కళ్యాణ్ కన్నీరు
, బుధవారం, 10 మే 2017 (14:30 IST)
రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని సందర్శించి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నిషిత్ మృతదేహం వద్ద రోదిస్తున్న నారాయణ కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ ఓదార్చారు.
 
అనంతరం పవన్ మాట్లాడుతూ... ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు నిషిత్ ఇలా అర్థంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. చెట్టంత కుమారుడు కళ్లెదుటే కనుమరుగయ్యే పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అంతా కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సి వుందన్నారు. నిషిత్, అతడి స్నేహితుడు వర్మ కుటుంబ సభ్యులకు తమ జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ దూకుడుకు నో బ్రేక్.. ఎఫ్‌బీఐ డైరక్టర్ కామీపై వేటు.. హిల్లరీ కేసు నమోదు చేయకపోవడం వల్లే?