Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమను అంగీకరించలేదని ప్రేయసితో కలసి పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రేమను అంగీకరించలేదని ప్రేయసితో కలసి పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
, మంగళవారం, 21 మే 2019 (14:02 IST)
తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వల్లూరు మండలం గంగాయపల్లె సమీపంలోని రైల్వే ట్రాక్‌పై సోమవారం అర్ధరాత్రి ఈ జంట ఆత్మహత్య చేసుకుంది. 
 
రైల్వే పోలీసుల కథనం ప్రకారం ప్రియుడు రమేష్ బాబు అనంతపురం జిల్లా 1 టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే రమేష్‌ కుటుంబ సభ్యులు జూన్ 5వ తేదీన వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. తమ పెద్దలు ప్రేమ వివాహం జరిపించకపోవడంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట రైల్వే ట్రాక్ పైన తలపెట్టి దారుణానికి పాల్పడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీ యోగ ఫోటోపై ట్విట్టర్లో ట్వింకిల్ ఖన్నా సెటైర్