Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌కు అహం తలకెక్కింది.. రోజాకు అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా? (video)

జగన్‌కు అహం తలకెక్కింది.. రోజాకు అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా? (video)
, సోమవారం, 20 జనవరి 2020 (14:53 IST)
వైసీపీ పతనం మొదలైంది.. అమరావతిలో అభివృద్ధి రోజాకు కనిపించడం లేదా..? అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఆర్కే రోజా ఓసారి కళ్లను పరీక్ష చేయించుకోవాలని ఆమె సైటైర్లు విసిరారు. ప్యాకేజీల కోసమే రోజా చౌకబారు వ్యాఖ్యలు చేస్తోందని ఫైర్ అయ్యారు. వైసీపీ వేసిన కమిటీలకు చట్టబద్ధత లేదని చెప్పారు. 
 
అవినీతి కేసుల్లో ఉన్న మీకు టీడీపీపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి అహంకారం తలకెక్కిందని అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే జగన్ రోడ్లు పట్టుకుని తిరిగారని, ఏడు నెలల్లో రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల సంఖ్య రోజాకు తెలుసా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
ప్రజాగ్రహానికి భయపడే దొడ్డి దారిన రోడ్లు వేయించుకున్నారని మండిపడ్డారు. నగరి ప్రజలు రోజా నార తీసేశారు, రాష్ట్రంలో ప్రాంత, మత, కుల విద్వేషాలు రగిల్చారు. రాబోయే రోజుల్లో టీడీపీ 170 సీట్లు గెలుస్తుందని.. వైసీపీ పతనం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు తీవ్రరూపం.. భూములను త్యాగం చేస్తే? (video)