Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది: జగ్గారెడ్డి

Advertiesment
Congress party
, శనివారం, 30 జనవరి 2021 (20:31 IST)
ఏపీ కాంగ్రెస్ ఆంధ్రారత్న భవన్‌లో నూతన లీగల్ సెల్ అధ్యక్షుడు వి.గురునాథం ప్రమాణస్వీకర కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు.
 
లీగల్ సెల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వి.రంగనాథం గారికి శుభాకాంక్షలు తెలిపారు జగ్గారెడ్డి. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉంది. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సోనియా, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇస్తారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కార్యకర్త ధైర్యంగా మాట ఇచ్చాము, హోదా ఇచ్చామని చెప్పుకుంటూ తిరుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అనంతరం ఏపీలో కూడా అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలు అన్నారు. కానీ ఈ రోజు బీజేపీ ప్రత్యేక హోదానే ఇచ్చేది లేదని చెప్పేసింది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు.. భార్య క్రెడిట్ కార్డుతో ఆ పని చేశాడు..?