Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఏఎస్ఐ.. Video వైరల్

Advertiesment
si dance

వరుణ్

, మంగళవారం, 2 జులై 2024 (10:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసు పికెట్‌ ఏర్పాటుచేశారు. పోలీసులను మొహరించారు. అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. 
 
విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈలలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఆ ఎస్ఐ సంబరాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఏఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవుడి ముందు లొంగిపోయాడు.. అందుకే మరణ శిక్ష రద్దు : ఒరిస్సా హైకోర్టు