ఈ మధ్య గుండెపోటుతో మృతి చెందేవారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా నెల్లూరులో ఓ పూజారి పూజ చేస్తూ కుప్పకూలిపోయాడు. దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీవెంగమాంబ దేవాలయంలో సురేశ్ అనే వ్యక్తి పూజారీగా విధులు నిర్వహిస్తున్నారు.
దసరా పండగ నేపథ్యంలో గురువారం పూజలు చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ప్రభుత్వ అంబులెన్స్ దొరక్కపోవడంతో స్థానికులు అతనిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతిచెందాడని తెలిపారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది లేకపోవడం వల్లే పూజారి సురేశ్ మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతనికి గుండెపోటు రావడంతోన ప్రాణాలు కోల్పోయాడని టాక్ వస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.